శూద్రమహాకావ్యం "శ్రీ శూదగంగ..
శ్రీ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
ప్రముఖ కవి - విశ్లేషకుడు
ఉదారపు ఆశయాల
తరంగాంతరంగ గంగ
తలరాత ఎలా మారినది?
ఇంత చిత్రంగా
తన రాతను ఎవరు అలా రాసినది?
శ్రమకావ్యం' 'నేను అడవిని మాట్లాడుతున్నాను' రెండు శక్తివంతమైన దీర్ఘవచన కావ్యాలు రచించిన మిత్రులు సుద్దాల అశోక్ తేజ ఇప్పుడు మరో కావ్యం రాశారు. అది 'శ్రీ శూద్రగంగ'. 'శ్రమకావ్యం' వైజ్ఞానిక కావ్యం. 'నేను అడవిని మాట్లాడుతున్నాను' పర్యావరణ కావ్యం. శ్రీ శూద్రగంగ అస్తిత్వ కావ్యం. ఈ కావ్యంలో శూద్ర, శ్రమ, పర్యావరణ లక్షణాలు అంతస్సూత్రంగా ఉన్నాయి.
ఆధునిక తెలుగు కవిత్వంలో వచన కవిత్వానికి తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉంది(1933-2024). ఈ సుదీర్ఘమైన చరిత్రలో వచన కవిత్వం అనేక ఉద్యమాలకు, భావజాలాలకు ప్రభావితమయింది. రూపపరంగా అనేక ప్రయోగాలు జరిగాయి. 'పదునెనిమిది పాదాల' నుండి పద్దెనిమిది అక్షరాల వరకు పయనించింది, పదునెనిమిది పాదాల నుండి పద్దెనిమిదిపర్వాల దాకా విస్తరించింది. మినీ కవిత, హైకూ, నానీలు, నానోలు, రెక్కలు, గాథలు,చమత్కారాలు, టుమ్రీలు వంటి అనేక సూక్ష్మ కవిత్వ ప్రక్రియలు పుట్టాయి. ఈ ప్రయోగాల మధ్యన వచనమహాకావ్య సంప్రదాయం కూడా కొనసాగుతున్నది. తెలంగాణ (కుందుర్తి), త్వమేవాహం (ఆరుద్ర), నాదేశం-నాప్రజలు (శేషేంద్ర), విశ్వంభర (సి.నారాయణరెడ్డి), ఆసుపత్రిగీతం (కె.శివారెడ్డి), కొయ్యగుర్రం (నగ్నముని), జలగీతం (ఎన్.గోపి), కులగీతం......................
శూద్రమహాకావ్యం "శ్రీ శూదగంగ.. శ్రీ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ప్రముఖ కవి - విశ్లేషకుడు ఉదారపు ఆశయాల తరంగాంతరంగ గంగ తలరాత ఎలా మారినది? ఇంత చిత్రంగా తన రాతను ఎవరు అలా రాసినది? శ్రమకావ్యం' 'నేను అడవిని మాట్లాడుతున్నాను' రెండు శక్తివంతమైన దీర్ఘవచన కావ్యాలు రచించిన మిత్రులు సుద్దాల అశోక్ తేజ ఇప్పుడు మరో కావ్యం రాశారు. అది 'శ్రీ శూద్రగంగ'. 'శ్రమకావ్యం' వైజ్ఞానిక కావ్యం. 'నేను అడవిని మాట్లాడుతున్నాను' పర్యావరణ కావ్యం. శ్రీ శూద్రగంగ అస్తిత్వ కావ్యం. ఈ కావ్యంలో శూద్ర, శ్రమ, పర్యావరణ లక్షణాలు అంతస్సూత్రంగా ఉన్నాయి. ఆధునిక తెలుగు కవిత్వంలో వచన కవిత్వానికి తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉంది(1933-2024). ఈ సుదీర్ఘమైన చరిత్రలో వచన కవిత్వం అనేక ఉద్యమాలకు, భావజాలాలకు ప్రభావితమయింది. రూపపరంగా అనేక ప్రయోగాలు జరిగాయి. 'పదునెనిమిది పాదాల' నుండి పద్దెనిమిది అక్షరాల వరకు పయనించింది, పదునెనిమిది పాదాల నుండి పద్దెనిమిదిపర్వాల దాకా విస్తరించింది. మినీ కవిత, హైకూ, నానీలు, నానోలు, రెక్కలు, గాథలు,చమత్కారాలు, టుమ్రీలు వంటి అనేక సూక్ష్మ కవిత్వ ప్రక్రియలు పుట్టాయి. ఈ ప్రయోగాల మధ్యన వచనమహాకావ్య సంప్రదాయం కూడా కొనసాగుతున్నది. తెలంగాణ (కుందుర్తి), త్వమేవాహం (ఆరుద్ర), నాదేశం-నాప్రజలు (శేషేంద్ర), విశ్వంభర (సి.నారాయణరెడ్డి), ఆసుపత్రిగీతం (కె.శివారెడ్డి), కొయ్యగుర్రం (నగ్నముని), జలగీతం (ఎన్.గోపి), కులగీతం......................© 2017,www.logili.com All Rights Reserved.