Srimad Bhagavad Gita Kathalu

Rs.300
Rs.300

Srimad Bhagavad Gita Kathalu
INR
MANIMN6794
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఓం శ్రీ గణేశాయనమః

ఉపోద్ఘాత

మన సనాతన ధర్మం ప్రతిపాదిస్తున్న అనేక సిద్ధాంతాల్లో అతిముఖ్యమైనవి,

  1. పునర్జన్మ
  2. పురుషార్థ సాధన

ప్రతి జీవికి తాను చేసుకొన్న కర్మఫలాన్నిబట్టి అనేక జన్మలు కలుగుతూ ఉంటాయి. దాంట్లో భాగమే. మానవ జన్మ. 'జంతూనాం నరజన్మ దుర్లభం' అంటారు. 84 లక్షల జీవరాశుల్లో నరజన్మ అన్నది చాలా ఉతృష్టమైంది. మిగతా జీవులెవ్వరికీ లేనటువంటి వివేకం మనిషికుంది. ఏది తప్పు ఏది ఒప్పు అనే వివేచన మనిషి చెయ్యగలడు. అయినప్పటికీ, ఒప్పు వదిలి పెట్టి తప్పే ఎందుకు చేస్తున్నట్లు. ఈ వివేక హీనత్వమే జన్మకు కారణమవుతున్నాది. ఇది చాలా బలీయమైంది. ఒకంతట వదిలిపెట్టజాలనిది. సాధకులకు చాలా ఇబ్బందిని కలిగించేది ఇదే. ఇటువంటి వారి గురించే మన ఋషులందరూ తపస్సులు చేసి అనేకమార్గాలను కనుగొన్నారు. సాధకుల పరిస్థితే ఇలాఉంటే మరి సాధనామార్గమే తెలియని వారిని ఏమనాలి. వీరందర్నీ సామాన్యులు అనవచ్చు. ఇటువంటి సామాన్యుల్లో చాలామందికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది. భగవంతుడు తమకు రక్షకుడని, ఆతడి దయ ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుందని వారి నమ్మకం. ఇటువంటి వారినే భగవద్గీత ఆర్తులు, అర్ధార్ధులు అని విభాగించింది. 7వ అధ్యాయం, 16వ శ్లోకంలో భక్తులు నాలుగు రకాలుగా ఉంటారని భగవానుడే చెప్పాడు. ఒకరు ఆర్తులు, బాధల నుండి విముక్తి కోరేవారు. రెండవ రకం జిజ్ఞాసువులు భగవతత్త్వం తెలుసుకోవడం కోసం పాటుపడేవారు. మూడవరకం అర్ధార్ధులు, ఐశ్వర్యం, అధికారం, కీర్తితో బాటుగ పరమార్థాన్ని కూడా కోరుకునేవారు. ఇంక నాలుగువరకం జ్ఞానులు, జీవన ముక్తావస్థకు చేరుకునేవారు. వీరందరిలో జ్ఞాని తనకు ఇష్టుడని భగవానుడే చెప్పాడు (7-17). జ్ఞాని శ్రేష్టుడని చెప్పినప్పటికీ మిగతా వారిని కూడా ఉదారులని చెప్పడం జరిగింది. ఎందుకంటే భక్తిలేని సామాన్యులకంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్ధులు అందరూ ఉత్తమ తరగతికి చెందిన వారని భగవానుని ఉద్దేశ్యం.

పునర్జన్మ సిద్ధాంతం పాపపుణ్యకర్మల సమ్మేళనం నుంచి పుట్టింది. మనిషికి పుణ్య కర్మలెటువంటివో, పాపకర్మలెటువంటివో ఖచ్చితంగా తెలుసు. పుణ్యకర్మలు చెయ్యడానికి ఒక ప్రక్క సిద్ధపడుతూ వేరొక ప్రక్క పాపకర్మలు కూడా చేసేస్తూ ఉంటాడు. కోటాను కోట్ల జన్మల సంస్కార బలం జీవుడిని ఈ విధంగా ఏడిపిస్తూ ఉంటుంది. దానివల్లనే సంసారకూపం నుండి బయటపడలేక సతమతమవుతూ ఉంటాడు. చీకటిలో త్రాడును చూసి పాము అనుకుని భయపడి ఏడిచినట్లు జన్మ పరంపరా రహస్యం అర్థంకాక సుఖ దుఃఖ వలయంలో చిక్కుకుని దిక్కుతోచకుండా ఉంటాడు. అందుకే శంకరులు (శంకర భగవత్పాదులు) ఇలా అంటారు.......................

ఓం శ్రీ గణేశాయనమః ఉపోద్ఘాత మన సనాతన ధర్మం ప్రతిపాదిస్తున్న అనేక సిద్ధాంతాల్లో అతిముఖ్యమైనవి, పునర్జన్మ పురుషార్థ సాధన ప్రతి జీవికి తాను చేసుకొన్న కర్మఫలాన్నిబట్టి అనేక జన్మలు కలుగుతూ ఉంటాయి. దాంట్లో భాగమే. మానవ జన్మ. 'జంతూనాం నరజన్మ దుర్లభం' అంటారు. 84 లక్షల జీవరాశుల్లో నరజన్మ అన్నది చాలా ఉతృష్టమైంది. మిగతా జీవులెవ్వరికీ లేనటువంటి వివేకం మనిషికుంది. ఏది తప్పు ఏది ఒప్పు అనే వివేచన మనిషి చెయ్యగలడు. అయినప్పటికీ, ఒప్పు వదిలి పెట్టి తప్పే ఎందుకు చేస్తున్నట్లు. ఈ వివేక హీనత్వమే జన్మకు కారణమవుతున్నాది. ఇది చాలా బలీయమైంది. ఒకంతట వదిలిపెట్టజాలనిది. సాధకులకు చాలా ఇబ్బందిని కలిగించేది ఇదే. ఇటువంటి వారి గురించే మన ఋషులందరూ తపస్సులు చేసి అనేకమార్గాలను కనుగొన్నారు. సాధకుల పరిస్థితే ఇలాఉంటే మరి సాధనామార్గమే తెలియని వారిని ఏమనాలి. వీరందర్నీ సామాన్యులు అనవచ్చు. ఇటువంటి సామాన్యుల్లో చాలామందికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుంది. భగవంతుడు తమకు రక్షకుడని, ఆతడి దయ ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుందని వారి నమ్మకం. ఇటువంటి వారినే భగవద్గీత ఆర్తులు, అర్ధార్ధులు అని విభాగించింది. 7వ అధ్యాయం, 16వ శ్లోకంలో భక్తులు నాలుగు రకాలుగా ఉంటారని భగవానుడే చెప్పాడు. ఒకరు ఆర్తులు, బాధల నుండి విముక్తి కోరేవారు. రెండవ రకం జిజ్ఞాసువులు భగవతత్త్వం తెలుసుకోవడం కోసం పాటుపడేవారు. మూడవరకం అర్ధార్ధులు, ఐశ్వర్యం, అధికారం, కీర్తితో బాటుగ పరమార్థాన్ని కూడా కోరుకునేవారు. ఇంక నాలుగువరకం జ్ఞానులు, జీవన ముక్తావస్థకు చేరుకునేవారు. వీరందరిలో జ్ఞాని తనకు ఇష్టుడని భగవానుడే చెప్పాడు (7-17). జ్ఞాని శ్రేష్టుడని చెప్పినప్పటికీ మిగతా వారిని కూడా ఉదారులని చెప్పడం జరిగింది. ఎందుకంటే భక్తిలేని సామాన్యులకంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్ధులు అందరూ ఉత్తమ తరగతికి చెందిన వారని భగవానుని ఉద్దేశ్యం. పునర్జన్మ సిద్ధాంతం పాపపుణ్యకర్మల సమ్మేళనం నుంచి పుట్టింది. మనిషికి పుణ్య కర్మలెటువంటివో, పాపకర్మలెటువంటివో ఖచ్చితంగా తెలుసు. పుణ్యకర్మలు చెయ్యడానికి ఒక ప్రక్క సిద్ధపడుతూ వేరొక ప్రక్క పాపకర్మలు కూడా చేసేస్తూ ఉంటాడు. కోటాను కోట్ల జన్మల సంస్కార బలం జీవుడిని ఈ విధంగా ఏడిపిస్తూ ఉంటుంది. దానివల్లనే సంసారకూపం నుండి బయటపడలేక సతమతమవుతూ ఉంటాడు. చీకటిలో త్రాడును చూసి పాము అనుకుని భయపడి ఏడిచినట్లు జన్మ పరంపరా రహస్యం అర్థంకాక సుఖ దుఃఖ వలయంలో చిక్కుకుని దిక్కుతోచకుండా ఉంటాడు. అందుకే శంకరులు (శంకర భగవత్పాదులు) ఇలా అంటారు.......................

Features

  • : Srimad Bhagavad Gita Kathalu
  • : Pisapati Ramamurty Sastri
  • : Sri Dharma Sastra Prachuranalu
  • : MANIMN6794
  • : paparback
  • : May, 2023
  • : 307
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Srimad Bhagavad Gita Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam