ఈ సమాజం పతనం కాక తప్పదు
మనిషి కూడా ఒక సాంఘిక జంతువే : మనిషికీ, జంతువుకూ వున్న ముఖ్యమైన తేడా ఏమిటంటే, మానవుడు తనకు సంబంధించిన మంచికీ, చెడుకూ తాను వుంటున్న సంఘముపైనే ఆధారపడతాడు. నిజం చెప్పాలంటే మానవుడు ఇంతవరకూ తనకంటే అత్యధికమైన శక్తిగల జంతువులను అధిగమించాడు. హిమయుగం వంటి గొప్ప ప్రకృతి ప్రమాదాల నుండి అతడు తన బుద్ధిబలంతో తప్పించుకున్నాడు. వీటికంతటికి అతనికి అతడు నివసించిన మానవ సంఘం ఎంతో తోడ్పాటునిచ్చింది. మానవ సంఘం బలహీనమైన మనిషి శక్తినీ, బలాన్నీ వందల కొలదీ మానవుల ఐకమత్యం ద్వారా పెంపొందింపజేసింది. దీని మూలంగానే వ్యక్తి ప్రకృతి ఉత్పాతాల నుంచీ, క్రూర జంతువుల నుంచీ శత్రువుల నుంచీ తన్ను తాను రక్షించుకోగలిగాడు. అయితే నేడు ఆ సంఘమే మానవుడ్ని ప్రకృతి వైపరీత్యాల నుంచీ, క్రూర మృగాల నుంచీ కాపాడుతూనే అతన్ని వాటి కంటే భయంకరమైన శత్రువులకు అప్పగించివేసింది. ఆ శత్రువులు ప్రస్తుతం మానవ జీవితాన్ని నరకతుల్యం చేసివేశారు.
తనకు చెందిన వ్యక్తులకు న్యాయం చేకూర్చడం సంఘం యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రతివ్యక్తీ తన శ్రమకు తగిన ఫలితాన్ని అనుభవించడమే 'న్యాయం' అనే దానికి అర్ధం. కానీ నేడు దీనికి వ్యతిరేకమైన పరిస్థితి వుంది.
వ్యక్తి జీవితానికి డబ్బు అత్యంత ప్రధానమైనది. కూడు, గుడ్డ, గూడు ఇవే నిజమైన ధనమవుతుంది. ఈ నిజమైన ధనాన్ని మనిషి సృష్టిస్తాడు. అతడు వరి, గోధుమ, ప్రత్తి వంటివాటిని మట్టి నుండి పుట్టిస్తాడు. అతడు వేకువజామునే పొలానికెళతాడు. జేష్ఠమాసపు తీవ్రమైన ఎండయైనా, మార్గశిర, పుష్య మాసములు ప్రాతఃకాలపు చలియైనా రైతు భూమిని దున్ని శరీరమంతా చెమటతో తడిసిపోతుంటాడు. అతని అరచేతులలో బొబ్బలెక్కుతాయి. పారతో పని చేస్తుంటే శ్వాస పీల్చడమే కష్టమవుతుంది. అయినా రైతు వీటిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూనే................................
ఈ సమాజం పతనం కాక తప్పదు మనిషి కూడా ఒక సాంఘిక జంతువే : మనిషికీ, జంతువుకూ వున్న ముఖ్యమైన తేడా ఏమిటంటే, మానవుడు తనకు సంబంధించిన మంచికీ, చెడుకూ తాను వుంటున్న సంఘముపైనే ఆధారపడతాడు. నిజం చెప్పాలంటే మానవుడు ఇంతవరకూ తనకంటే అత్యధికమైన శక్తిగల జంతువులను అధిగమించాడు. హిమయుగం వంటి గొప్ప ప్రకృతి ప్రమాదాల నుండి అతడు తన బుద్ధిబలంతో తప్పించుకున్నాడు. వీటికంతటికి అతనికి అతడు నివసించిన మానవ సంఘం ఎంతో తోడ్పాటునిచ్చింది. మానవ సంఘం బలహీనమైన మనిషి శక్తినీ, బలాన్నీ వందల కొలదీ మానవుల ఐకమత్యం ద్వారా పెంపొందింపజేసింది. దీని మూలంగానే వ్యక్తి ప్రకృతి ఉత్పాతాల నుంచీ, క్రూర జంతువుల నుంచీ శత్రువుల నుంచీ తన్ను తాను రక్షించుకోగలిగాడు. అయితే నేడు ఆ సంఘమే మానవుడ్ని ప్రకృతి వైపరీత్యాల నుంచీ, క్రూర మృగాల నుంచీ కాపాడుతూనే అతన్ని వాటి కంటే భయంకరమైన శత్రువులకు అప్పగించివేసింది. ఆ శత్రువులు ప్రస్తుతం మానవ జీవితాన్ని నరకతుల్యం చేసివేశారు. తనకు చెందిన వ్యక్తులకు న్యాయం చేకూర్చడం సంఘం యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రతివ్యక్తీ తన శ్రమకు తగిన ఫలితాన్ని అనుభవించడమే 'న్యాయం' అనే దానికి అర్ధం. కానీ నేడు దీనికి వ్యతిరేకమైన పరిస్థితి వుంది. వ్యక్తి జీవితానికి డబ్బు అత్యంత ప్రధానమైనది. కూడు, గుడ్డ, గూడు ఇవే నిజమైన ధనమవుతుంది. ఈ నిజమైన ధనాన్ని మనిషి సృష్టిస్తాడు. అతడు వరి, గోధుమ, ప్రత్తి వంటివాటిని మట్టి నుండి పుట్టిస్తాడు. అతడు వేకువజామునే పొలానికెళతాడు. జేష్ఠమాసపు తీవ్రమైన ఎండయైనా, మార్గశిర, పుష్య మాసములు ప్రాతఃకాలపు చలియైనా రైతు భూమిని దున్ని శరీరమంతా చెమటతో తడిసిపోతుంటాడు. అతని అరచేతులలో బొబ్బలెక్కుతాయి. పారతో పని చేస్తుంటే శ్వాస పీల్చడమే కష్టమవుతుంది. అయినా రైతు వీటిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూనే................................© 2017,www.logili.com All Rights Reserved.