పేర్లు
పూర్వం ఒక రాజు కాశీ యాత్ర చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడి ప్రాకృతిక సౌందర్యానికి ముగ్ధుడై తమ కులదైవమైన విశాఖ స్వామి పేర బంగాళా ఖాతం తీరంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఆటుపోట్లకు గురైన ఆలయం శిథిలమై పోయింది. ఆ తర్వాత కొంతకాలానికి సముద్రం ముందుకు వచ్చి ఆలయం కనుమరుగైపోయింది. ఈ ప్రాంతాన్ని తీర్థపు రాళ్లు అని పిలుస్తుంటారు. పుణ్యస్నానాలు చేస్తుంటారు. ఈ ప్రాంతానికే గల మరోపేరు లాసన్స్ బే. ఈ విశాఖ స్వామి ఆలయం మూలంగానే విశాఖ పట్నం అనే పేరు వచ్చినట్లు ఒక కధనం.
క్రీ.పూ 4 వ శతాబ్దపు పాణిని, కాత్యాయనుడి సంస్కృత రచనల్లో మరియు క్రీ.పూ 5,6 శతాబ్దాల వివిధ మత గ్రంథాలలో విశాఖపట్నం ప్రస్తావన వుంది.
అరేబియా వర్తకులు సముద్రమ్మీద ప్రయాణికులు వ్యాపారం కోసం యిక్కడకు వచ్చేవారు.వారి సూఫీ గురువైన ఇస్సాక్ ను యిక్కడి వారు కూడా పూజించేవారు. ఇక్కడే ప్రార్ధనల కోసం ఇస్సాక్ దర్గా కూడా వుండి వుంటుంది. అలా ఈ ప్రాంతానికి ఇస్సాక్ పట్టణమనే పేరు వచ్చి వుండవచ్చు. కాల క్రమంలో విశాఖపట్నంగా మారి వుండవచ్చు.///////////////////
పేర్లు పూర్వం ఒక రాజు కాశీ యాత్ర చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడి ప్రాకృతిక సౌందర్యానికి ముగ్ధుడై తమ కులదైవమైన విశాఖ స్వామి పేర బంగాళా ఖాతం తీరంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఆటుపోట్లకు గురైన ఆలయం శిథిలమై పోయింది. ఆ తర్వాత కొంతకాలానికి సముద్రం ముందుకు వచ్చి ఆలయం కనుమరుగైపోయింది. ఈ ప్రాంతాన్ని తీర్థపు రాళ్లు అని పిలుస్తుంటారు. పుణ్యస్నానాలు చేస్తుంటారు. ఈ ప్రాంతానికే గల మరోపేరు లాసన్స్ బే. ఈ విశాఖ స్వామి ఆలయం మూలంగానే విశాఖ పట్నం అనే పేరు వచ్చినట్లు ఒక కధనం. క్రీ.పూ 4 వ శతాబ్దపు పాణిని, కాత్యాయనుడి సంస్కృత రచనల్లో మరియు క్రీ.పూ 5,6 శతాబ్దాల వివిధ మత గ్రంథాలలో విశాఖపట్నం ప్రస్తావన వుంది. అరేబియా వర్తకులు సముద్రమ్మీద ప్రయాణికులు వ్యాపారం కోసం యిక్కడకు వచ్చేవారు.వారి సూఫీ గురువైన ఇస్సాక్ ను యిక్కడి వారు కూడా పూజించేవారు. ఇక్కడే ప్రార్ధనల కోసం ఇస్సాక్ దర్గా కూడా వుండి వుంటుంది. అలా ఈ ప్రాంతానికి ఇస్సాక్ పట్టణమనే పేరు వచ్చి వుండవచ్చు. కాల క్రమంలో విశాఖపట్నంగా మారి వుండవచ్చు.///////////////////© 2017,www.logili.com All Rights Reserved.