Tyaga Nirutulu

By Dr Gadam Gopalaswamy (Author)
Rs.150
Rs.150

Tyaga Nirutulu
INR
MANIMN6861
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విస్మృత యోధుల స్మృతి గీత

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షలాది భారతీయులు పాల్గొన్నారు. 1. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ ఎందరో తమ సమస్తమూ త్యాగం చేసిన పోరాటయోధులున్నారు. కానీ, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పటేల్, భగత్సింగ్, సుభాష్ చంద్రబోసు వలె దేశం అంతా తెలిసినవారు వారిలో కొద్దిమందే! ఒక తోట నరసయ్య, ఒక గరిమెళ్ళ సత్యనారాయణ, ఒక ఉన్నవ లక్ష్మీనారాయణ, కన్నెగంటి హనుమంతు, ద్వారబంధాల చంద్రయ్య భారత దేశంలో ఏ మహానాయకుడికీ తీసిపోని దేశభక్తి ప్రదర్శించినవారే! దేశానికి వారిని పరిచయం చేయటంలో మనమే విఫలమయ్యాం. ఎవరి కృషి గురించి తరువాతి తరానికి తెలియదో, ఎవరి త్యాగం తరువాతి తరానికి ప్రశంసాత్మకంగా చేరలేదో, ఎవరి స్ఫూర్తిని తరువాతి తరం అందుకోలేకపోయిందో వారిని విస్మరించిన అపచారం మనవల్ల జరిగింది. మన 15 ముందుతరం ఘనతను మన తరువాతి తరానికి చేర్చకపోవటం మన అపచారమే! స్వాతంత్ర్య పోరాటంలో బెంగాల్, మహారాష్ట్రలు నాయకుల్ని తయారుచేశాయి. కానీ ఆంధ్రుల నుంచి కాకలుతీరిన కార్యకర్తలు అధికసంఖ్యలో తయారయ్యారు. "నాకన్నా ముందే హరిజన సేవను ప్రారంభించినవారు ఆంధ్రులు" అని మహాత్మాగాంధీ ప్రకటించారంటే అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు జాతీయోద్యమంలో పాల్గొన్న వైనం కళ్ళకు కనబడుతోంది. అంతగా ప్రజల్ని సన్నద్ధపరచిన స్థానిక నాయకత్వం తెలుగు వారికుండటం వలననే అది సాధ్యపడింది. కానీ, తెలుగు వారికి నాయకత్వం వహించిన అనేకమంది ధీరోదాత్తులు చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకోలేకపోయారు. ప్రశంసలు దక్కని ఈ అన్సంగ్ హీరోలలో శ్రీ పసల కృష్ణమూర్తి, శ్రీమతి అంజలక్ష్మి దంపతులు ముఖ్యులు. వారి త్యాగమయ పోరాటగాథని గ్రంథస్థం చేయడం అభినందనీయం. పరాయి పాలన, కట్టుబానిసత్వం, అవిద్య, అజ్ఞానాలలో మునిగితేలుతున్న జాతిని మేల్కొల్పేందుకు సంస్కర్తల కోసం జాతి ఎదురుచూస్తున్న సమయంలో ప్రజా చైతన్యాన్ని ప్రోదిచేసిన ఈ దంపతుల సేవ నిరుపమానమైనది. అనంతమైన ఆత్మవిశ్వాసం, అసమాన త్యాగశీలత, అద్భుతమైన దూరదృష్టి వారిని.............

విస్మృత యోధుల స్మృతి గీత భారత స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షలాది భారతీయులు పాల్గొన్నారు. 1. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ ఎందరో తమ సమస్తమూ త్యాగం చేసిన పోరాటయోధులున్నారు. కానీ, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పటేల్, భగత్సింగ్, సుభాష్ చంద్రబోసు వలె దేశం అంతా తెలిసినవారు వారిలో కొద్దిమందే! ఒక తోట నరసయ్య, ఒక గరిమెళ్ళ సత్యనారాయణ, ఒక ఉన్నవ లక్ష్మీనారాయణ, కన్నెగంటి హనుమంతు, ద్వారబంధాల చంద్రయ్య భారత దేశంలో ఏ మహానాయకుడికీ తీసిపోని దేశభక్తి ప్రదర్శించినవారే! దేశానికి వారిని పరిచయం చేయటంలో మనమే విఫలమయ్యాం. ఎవరి కృషి గురించి తరువాతి తరానికి తెలియదో, ఎవరి త్యాగం తరువాతి తరానికి ప్రశంసాత్మకంగా చేరలేదో, ఎవరి స్ఫూర్తిని తరువాతి తరం అందుకోలేకపోయిందో వారిని విస్మరించిన అపచారం మనవల్ల జరిగింది. మన 15 ముందుతరం ఘనతను మన తరువాతి తరానికి చేర్చకపోవటం మన అపచారమే! స్వాతంత్ర్య పోరాటంలో బెంగాల్, మహారాష్ట్రలు నాయకుల్ని తయారుచేశాయి. కానీ ఆంధ్రుల నుంచి కాకలుతీరిన కార్యకర్తలు అధికసంఖ్యలో తయారయ్యారు. "నాకన్నా ముందే హరిజన సేవను ప్రారంభించినవారు ఆంధ్రులు" అని మహాత్మాగాంధీ ప్రకటించారంటే అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు జాతీయోద్యమంలో పాల్గొన్న వైనం కళ్ళకు కనబడుతోంది. అంతగా ప్రజల్ని సన్నద్ధపరచిన స్థానిక నాయకత్వం తెలుగు వారికుండటం వలననే అది సాధ్యపడింది. కానీ, తెలుగు వారికి నాయకత్వం వహించిన అనేకమంది ధీరోదాత్తులు చరిత్ర పుటల్లో చోటు సంపాదించుకోలేకపోయారు. ప్రశంసలు దక్కని ఈ అన్సంగ్ హీరోలలో శ్రీ పసల కృష్ణమూర్తి, శ్రీమతి అంజలక్ష్మి దంపతులు ముఖ్యులు. వారి త్యాగమయ పోరాటగాథని గ్రంథస్థం చేయడం అభినందనీయం. పరాయి పాలన, కట్టుబానిసత్వం, అవిద్య, అజ్ఞానాలలో మునిగితేలుతున్న జాతిని మేల్కొల్పేందుకు సంస్కర్తల కోసం జాతి ఎదురుచూస్తున్న సమయంలో ప్రజా చైతన్యాన్ని ప్రోదిచేసిన ఈ దంపతుల సేవ నిరుపమానమైనది. అనంతమైన ఆత్మవిశ్వాసం, అసమాన త్యాగశీలత, అద్భుతమైన దూరదృష్టి వారిని.............

Features

  • : Tyaga Nirutulu
  • : Dr Gadam Gopalaswamy
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN6861
  • : Paparback
  • : Feb, 2026
  • : 189
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tyaga Nirutulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam