శ్రీ శుభకృతు నామసంవత్సర నవనాయకుల- నిర్ణయము - ఫలములు :- రాజు-శని, మంత్రి - గురువు, అరాధిపతి బుధుడు, ధాన్యాధిపతి శుక్రుడు, సేనాధిపతి బుధుడు, YA సస్యాధిపతి-రవి, మేఘాధిపతి బుధుడు,రసాధిపతి కుజుడు,నీరసాధిపతి-శని ఇవ్విధముగా నవనాయకులకు అధిపత్యములు సంభవించినవి.
బుధునకు మూడు ఆధిపత్యములున్నూ, శనికి రెండు ఆధిపత్యములున్నూ, శుక్ర, గురు, రవి, కుజులకు ఒక్కోక్క ఆధిపత్యము లభించినవి.నవనాయకులలో5 గురు శుభులు, 4 గురు పాపులుగాలెక్కించగావర్షముఒక్కతూమెడు, గాలిఒక్కతూమెడు,పాడిపంటలు9వీసాములుగాసంభవించగలవు.ఇయ్యదిసూర్యసిద్దాంతనిర్ణయము.1)శనిగ్రహమునకురాజు: నీరసాధిపత్యములు సంభవించుటచే ప్రపంచ ఆర్థిక స్థితిగతులు,భారతదేశస్థితిగతులు,తెలంగాణ ఆంధ్రరాష్ట్రముల స్థితిగతులు అస్తవ్యస్తముగానుండగలవు.
స్త్రీలయొక్కఅధికారములుమెండుగానుండగలవు.దౌర్జన్యాది కాండములు అతి భయంకరముగా నుండగలవు. ధనదోపిడివిధానములు,స్థలదోపిడివిధానములుక్రూరత్వమునుసంతరించుకోగలదు.అధికవ్యాధ్యులుఉచ్చస్థితిలోసంచరించగలవు. కరోనావంటి విచిత్రవ్యాధులు పునరుత్పత్తి జరుగును.సామాన్యుల జీవనములు బహువిధ కష్టనష్ట రూపములతో నుండగలవు. తెలంగాణ,ఆంధ్రయందుపంటలన్నియునువిస్తారముగాఫలించగలవు.
సమయానికి తగు వర్షములు అనుకూలించును. వ్యవసాయ రైతులు గిట్టు బాటు పొందుట కష్టతరము.ఉభయ రాష్ట్రములందు విద్యుత్తు కొరతలుండవు. విద్యారంగము అస్తవ్యస్తముగా యుండును. సాగునీటి పారుదల బాగుగాయుండును. 2)మంత్రిగురువ అగుటచ1ప్రభుత్వములుకష్టనష్టములనుతొలగించుటకుప్రయత్నములుబాగుగాజరుగును.సమయోచిత ప్రజ్ఞ విశేషములతో ప్రభుత్వము ఋణాదులను సాధించి తీరగలవు.
సంక్షేమపథకములు అతిగా వచ్చును. మైనార్టీ జనులు, బడుగు బలహీనవర్గములుఆనందమయ జీవనము .3)అర్ఘాధిపతిబుధుడు4)సేనాధిపతిబుధుడు5)మేఘాధిపతిబుధుడుమూడుఅధికారములు వచ్చుటచే- ప్రతివస్తువులధరలు రిటైలునందుఅధిక ధరలుగానూ, మార్కెట్ నందు అతి ధరలు తక్కువగాను, హెచ్చుతగ్గులుగా నుండగలవు.
రక్షక సైన్యాధిపత్యము అత్యంత బలముగా నుండి దొపిడీలను, కఠినముగా శిక్షించగలరు. వర్షములు రెండు రాష్ట్రములందునూ సమయోచితముగా పంటలకు అనువుగా వర్షించగలవు.
6) ధాన్యధిపతి శుక్రుడు అగుటచే ధాన్యజాతులన్నియునూ పంటయందు ఫలసాయము నిచ్చును.మధుమేహ వ్యాధులు,స్త్రీలవ్యాధులు అధికముగా నుండగలవు. ఉభయ రాష్ట్రములందునూ పారిశ్రామిక అభివృద్ధి బాగుగాయుండును. రైతులుపండించుధాన్యములన్నియునూ ప్రభుత్వములు ఖరీదును చేయుటకు సంక్షేమ పథకములను రూపొందించెదరు. ప్రతిదేవునిసన్నిధియందువిచిత్రస్థితి సంతరించుకోగలవు.
7) సస్యాధిపతి సూర్యుడు అగుటచే వరిలాంటి పంటలకు దోమకాటు అధికముగా వచ్చిననూ ఫలసాయము బాగుగానుండును.శనగలు, వేరుశనగ, ఎరుపు ధాన్యములు, మిర్చి, ప్రత్తి, గోధుమ, ప్రొద్దుతిరుగుడు పంటలు బాగుగా ఫలించగలవు.
© 2017,www.logili.com All Rights Reserved.