Adavi Santhisri

By Aadavi Baparaju (Author)
Rs.135
Rs.135

Adavi Santhisri
INR
EMESCO0201
In Stock
135.0
Rs.135


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            అడవి బాపిరాజు కవి, చిత్రకారుడు, శిల్పి, కథకుడు, నవలా రచయిత, గాయకుడు, పత్రికా సంపాదకుడు, కళాదర్శకుడు, జాతీయోద్యమ యోధుడు, ఆచార్యుడు. వీటన్నిటికీ మించి గొప్ప సహృదయుడు, మిత్రుల పెళ్ళిళ్ళలో మంగళహారతులు పాడినవాడు. కాల్పనికోద్యమకాలంలో బాపిరాజు ఇటు తెలుగు కవిత్వాన్నీ, సృజనాత్మక వచన రచనలనూ కొత్త పుంతలు తొక్కించాడు, అటు ఆంధ్రజాతి ప్రాచీన వైభవాన్ని మహోజ్జ్వలంగా దీపింపజేసి జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. ఆంధ్రత్వం మూర్తీభవించిన బాపిరాజు చారిత్రకనవలా రచనలో తనదంటూ ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నాడు.

            బాపిరాజు నవలల్లో హిమబిందు, గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి చారిత్రాత్మక నవలలు. నారాయణరావు, తుపాను, కోణంగి, నరుడు, జాజిమల్లి సాంఘీక నవలలు. వీటిలో 'నారాయణరావు' నవల విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు'తో పోటీపడి ఆంధ్రవిశ్వకళా పరిషత్తు బహుమతిని గెలుచుకుంది. కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, యుద్ధం, ఆయుధాల వివరాలు, ప్రేమ, ప్రణయం ఎత్తులకు పై ఎత్తులు వేయటం, వ్యవసాయం, వ్యాపారం, సవివరంగా, కళ్ళెదుట ఉన్నట్లే చిత్రీకరిస్తాడు.

           నాటకీయమైన సంభాషణలు కథాగమనాన్ని వేగవంతం చేస్తాయి. సందర్భోచితమైన గీతాలను నవలలో కూడా వాడుకోవడం ద్వారా తన సంగీత నృత్య రూపకంగా భాసింపజేస్తాడు. చారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు సార్థకజన్ముడు. అడవి బాపిరాజు గొప్ప భావకుడు. బాపిరాజు రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకథకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు.

            అడవి బాపిరాజు కవి, చిత్రకారుడు, శిల్పి, కథకుడు, నవలా రచయిత, గాయకుడు, పత్రికా సంపాదకుడు, కళాదర్శకుడు, జాతీయోద్యమ యోధుడు, ఆచార్యుడు. వీటన్నిటికీ మించి గొప్ప సహృదయుడు, మిత్రుల పెళ్ళిళ్ళలో మంగళహారతులు పాడినవాడు. కాల్పనికోద్యమకాలంలో బాపిరాజు ఇటు తెలుగు కవిత్వాన్నీ, సృజనాత్మక వచన రచనలనూ కొత్త పుంతలు తొక్కించాడు, అటు ఆంధ్రజాతి ప్రాచీన వైభవాన్ని మహోజ్జ్వలంగా దీపింపజేసి జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. ఆంధ్రత్వం మూర్తీభవించిన బాపిరాజు చారిత్రకనవలా రచనలో తనదంటూ ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నాడు.             బాపిరాజు నవలల్లో హిమబిందు, గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి చారిత్రాత్మక నవలలు. నారాయణరావు, తుపాను, కోణంగి, నరుడు, జాజిమల్లి సాంఘీక నవలలు. వీటిలో 'నారాయణరావు' నవల విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు'తో పోటీపడి ఆంధ్రవిశ్వకళా పరిషత్తు బహుమతిని గెలుచుకుంది. కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, యుద్ధం, ఆయుధాల వివరాలు, ప్రేమ, ప్రణయం ఎత్తులకు పై ఎత్తులు వేయటం, వ్యవసాయం, వ్యాపారం, సవివరంగా, కళ్ళెదుట ఉన్నట్లే చిత్రీకరిస్తాడు.            నాటకీయమైన సంభాషణలు కథాగమనాన్ని వేగవంతం చేస్తాయి. సందర్భోచితమైన గీతాలను నవలలో కూడా వాడుకోవడం ద్వారా తన సంగీత నృత్య రూపకంగా భాసింపజేస్తాడు. చారిత్రకమైనా, సాంఘికమైనా, ఏ నవలకు అదేసాటి. తన బహుముఖీన ప్రజ్ఞను ప్రతినవలలోనూ ప్రదర్శించి తన్మయులను చేసిన బాపిరాజు సార్థకజన్ముడు. అడవి బాపిరాజు గొప్ప భావకుడు. బాపిరాజు రచనలన్నీ అవి నవలలైనా, కథలైనా, కవిత్వమైనా భావుకథకు పట్టం కట్టాయి. కాల్పనికత మూర్తీభవించిన రచయిత బాపిరాజు.

Features

  • : Adavi Santhisri
  • : Aadavi Baparaju
  • : Emesco Publishers
  • : EMESCO0201
  • : 272
  • : Telugu
  • : 2015
  • : Paperback

Reviews

Be the first one to review this product

Discussion:Adavi Santhisri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam