స్వదేశీ సంస్థానాల పాలన: బ్రిటిష్ వ్యవహారాలు
భారతదేశం భౌగోళిక ఏకత్వం ఉన్న దేశం. సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ భారత్లో రాజకీయ ఐక్యత ఎప్పుడూ సాధ్యం కాలేదు. ప్రాచీన కాలం నుండీ ఈ ఏకీకరణ కోసం అడపా దడపా ప్రయత్నాలు జరిగాయి. ఈ దిశగా క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ రాజులు బింబిసారుడు, అజాత శత్రువు చేసిన ప్రయత్నాలు పెద్దవి. ఆ తర్వాత మూడు శతాబ్దాలకు ఇప్పటి భారతదేశంలోని చాలా భాగం మౌర్య పాలకుడైన అశోకుడి ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత కేవలం వంద సంవత్సరాలకే మౌర్య సామ్రాజ్యం పతనమయింది. దేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అనంతరం అయిదు శతాబ్దాలకు చంద్రగుప్తుడు, ఆయన కుమారుడైన సముద్ర గుప్తుడు భారతదేశపు చాలా భాగాలను ఒక తాటి మీదికి తెచ్చారు. 7వ శతాబ్దంలో హర్షుడు ఉత్తర భారతదేశానికి తిరుగులేని చక్రవర్తి అయినాడు. ఈ ప్రయత్నాలు, తర్వాత జరిగిన కృషి పదేపదే విఫలమవడానికి ఉన్న ఒకే ఒక కారణం : అవి ఆ రాజుకున్న వ్యక్తిత్వం, శక్తిసామర్థ్యాల మీద మాత్రమే ఆధారపడి కొనసాగడం. ఆ రాజు పతనమవగానే ఆయన నిర్మించిన సామ్రాజ్యం కుప్పకూలేది.
ఈ రాజుల కాలంలో కూడా స్వతంత్ర స్వభావం కలిగిన చిన్న రాజ్యాల కూటమిలాగానే ఉండేది వాళ్ళ సామ్రాజ్యం. ఆ చిన్న రాజ్యాల నుండి విధేయత పొందడం ద్వారా సామ్రాట్టు తన పాలన కొనసాగించేవాడు. సామ్రాట్టు మద్దతు ద్వారా తమ విదేశీ వ్యవహారాలను నిర్వహించుకుంటూ సామ్రాట్టుకు యుద్ధంలో.........................
స్వదేశీ సంస్థానాల పాలన: బ్రిటిష్ వ్యవహారాలు భారతదేశం భౌగోళిక ఏకత్వం ఉన్న దేశం. సుదీర్ఘమైన చరిత్ర ఉన్నప్పటికీ భారత్లో రాజకీయ ఐక్యత ఎప్పుడూ సాధ్యం కాలేదు. ప్రాచీన కాలం నుండీ ఈ ఏకీకరణ కోసం అడపా దడపా ప్రయత్నాలు జరిగాయి. ఈ దిశగా క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ రాజులు బింబిసారుడు, అజాత శత్రువు చేసిన ప్రయత్నాలు పెద్దవి. ఆ తర్వాత మూడు శతాబ్దాలకు ఇప్పటి భారతదేశంలోని చాలా భాగం మౌర్య పాలకుడైన అశోకుడి ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత కేవలం వంద సంవత్సరాలకే మౌర్య సామ్రాజ్యం పతనమయింది. దేశం అనేక చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అనంతరం అయిదు శతాబ్దాలకు చంద్రగుప్తుడు, ఆయన కుమారుడైన సముద్ర గుప్తుడు భారతదేశపు చాలా భాగాలను ఒక తాటి మీదికి తెచ్చారు. 7వ శతాబ్దంలో హర్షుడు ఉత్తర భారతదేశానికి తిరుగులేని చక్రవర్తి అయినాడు. ఈ ప్రయత్నాలు, తర్వాత జరిగిన కృషి పదేపదే విఫలమవడానికి ఉన్న ఒకే ఒక కారణం : అవి ఆ రాజుకున్న వ్యక్తిత్వం, శక్తిసామర్థ్యాల మీద మాత్రమే ఆధారపడి కొనసాగడం. ఆ రాజు పతనమవగానే ఆయన నిర్మించిన సామ్రాజ్యం కుప్పకూలేది. ఈ రాజుల కాలంలో కూడా స్వతంత్ర స్వభావం కలిగిన చిన్న రాజ్యాల కూటమిలాగానే ఉండేది వాళ్ళ సామ్రాజ్యం. ఆ చిన్న రాజ్యాల నుండి విధేయత పొందడం ద్వారా సామ్రాట్టు తన పాలన కొనసాగించేవాడు. సామ్రాట్టు మద్దతు ద్వారా తమ విదేశీ వ్యవహారాలను నిర్వహించుకుంటూ సామ్రాట్టుకు యుద్ధంలో.........................© 2017,www.logili.com All Rights Reserved.