ఒప్పంద కార్మిక వ్యవస్థ - నేపథ్యం
1572 నుంచి 1834 వరకూ దాదాపు రెండున్నర శతాబ్దాలపాటు, ఆఫ్రికా కరేబియన్ దేశాల నుంచి, సరుకుల్లా బానిసల కొనుగోలు జరిగేది. ఆ బానిసత్వం వ్యవస్థాగతంగా కొనసాగింది. బానిసలను గొలుసులతో బంధించి ఓడల్లో తీసుకు పోయేవారు. వారికి జీవితాంతపు చెర ఆ బానిసత్వం. నల్లవారితోబాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనల ఫలితంగా, బ్రిటన్లో 1834, ఫ్రాన్స్లో 1848, నెథర్లాండ్స్లో 1863, అమెరికాలో 1865 నాటికి, బానిసత్వం రద్దుచేయక తప్పలేదు. అప్పటినుండీ వారికి, బానిసలు బానిసల్లా కాకుండాపోయారు. విముక్తి పొందిన బానిసలను, పొలాల్లో జీతాలిచ్చి పనిచేయించుకోవడం, సమీకరించుకోవడం కూడా తోటల యజమానులకు కష్టమయింది. 1834–1837ల మధ్య మూడువేల మంది ఆంగ్లేయుల్ని, వెయ్యేసి మంది జర్మన్లను, స్కాట్లను, కొంతమంది ఐరిష్లను బానిసల స్థానంలో పనులు చేయించుకునే ప్రయత్నం చేసారు. అలా తెచ్చుకున్నవారికి, ఆ పనులేవీ అంతగా సాధ్య పడలేదు. పైగా ఇస్తున్న జీతం వారికి సరిపోదన్న గొడవలు మొదలుపెట్టారు. దానితో శ్వేత జాతీయులతో పని నెరవేర్చుకోవచ్చన్న వారి ప్రయోగం పూర్తిగా విఫలమయింది. వారి పెట్టుబడిదారీ విధానానికీ సామ్రాజ్యవాదానికీ లోపం రాని విధంగా, బ్రిటన్ ఆధిపత్యం కొనసాగేవిధంగా, చవకగా లొంగి ఉండే కార్మికుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. బానిసలు చేసిన పనులేవీ ఆగిపోకుండా కొనసాగేందుకు, అంతకు ముందరి బానిసల్లాగానే పని చేసేవారి కోసం, బ్రిటిష్ సామ్రాజ్యం ప్రత్యామ్నాయాల వేట ప్రారంభించింది.
బానిసత్వానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాలు
పందొమ్మిదవ శతాబ్దం రెండవ భాగం నాటికే, బ్రిటన్ అనేక పాత కాలనీలను స్వాధీనం చేసుకుంది. అవి త్వరితగతిన తోటల పెంపకానికి అవసరమైన కార్మికుల ప్రధాన దిగుమతిదారులుగా మారాయి. వీటిలో 1797లో స్పెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ట్రినిడాడ్, 1810లో ఫ్రాన్స్ నుంచి తీసుకొన్న మారిషస్ (లిలే డి ఫ్రాన్స్), 1814లో హాలండ్ నుంచి విలీనమైన బ్రిటిష్ గయానా లాంటి ద్వీపాలు ఉన్నాయి. భారతదేశం విషయానికొస్తే, 1858 నుంచి బ్రిటిష్ రాచరికపు ప్రత్యక్ష పరిపాలనలోనే ఉంది................................
ఒప్పంద కార్మిక వ్యవస్థ - నేపథ్యం 1572 నుంచి 1834 వరకూ దాదాపు రెండున్నర శతాబ్దాలపాటు, ఆఫ్రికా కరేబియన్ దేశాల నుంచి, సరుకుల్లా బానిసల కొనుగోలు జరిగేది. ఆ బానిసత్వం వ్యవస్థాగతంగా కొనసాగింది. బానిసలను గొలుసులతో బంధించి ఓడల్లో తీసుకు పోయేవారు. వారికి జీవితాంతపు చెర ఆ బానిసత్వం. నల్లవారితోబాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనల ఫలితంగా, బ్రిటన్లో 1834, ఫ్రాన్స్లో 1848, నెథర్లాండ్స్లో 1863, అమెరికాలో 1865 నాటికి, బానిసత్వం రద్దుచేయక తప్పలేదు. అప్పటినుండీ వారికి, బానిసలు బానిసల్లా కాకుండాపోయారు. విముక్తి పొందిన బానిసలను, పొలాల్లో జీతాలిచ్చి పనిచేయించుకోవడం, సమీకరించుకోవడం కూడా తోటల యజమానులకు కష్టమయింది. 1834–1837ల మధ్య మూడువేల మంది ఆంగ్లేయుల్ని, వెయ్యేసి మంది జర్మన్లను, స్కాట్లను, కొంతమంది ఐరిష్లను బానిసల స్థానంలో పనులు చేయించుకునే ప్రయత్నం చేసారు. అలా తెచ్చుకున్నవారికి, ఆ పనులేవీ అంతగా సాధ్య పడలేదు. పైగా ఇస్తున్న జీతం వారికి సరిపోదన్న గొడవలు మొదలుపెట్టారు. దానితో శ్వేత జాతీయులతో పని నెరవేర్చుకోవచ్చన్న వారి ప్రయోగం పూర్తిగా విఫలమయింది. వారి పెట్టుబడిదారీ విధానానికీ సామ్రాజ్యవాదానికీ లోపం రాని విధంగా, బ్రిటన్ ఆధిపత్యం కొనసాగేవిధంగా, చవకగా లొంగి ఉండే కార్మికుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. బానిసలు చేసిన పనులేవీ ఆగిపోకుండా కొనసాగేందుకు, అంతకు ముందరి బానిసల్లాగానే పని చేసేవారి కోసం, బ్రిటిష్ సామ్రాజ్యం ప్రత్యామ్నాయాల వేట ప్రారంభించింది. బానిసత్వానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాలు పందొమ్మిదవ శతాబ్దం రెండవ భాగం నాటికే, బ్రిటన్ అనేక పాత కాలనీలను స్వాధీనం చేసుకుంది. అవి త్వరితగతిన తోటల పెంపకానికి అవసరమైన కార్మికుల ప్రధాన దిగుమతిదారులుగా మారాయి. వీటిలో 1797లో స్పెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ట్రినిడాడ్, 1810లో ఫ్రాన్స్ నుంచి తీసుకొన్న మారిషస్ (లిలే డి ఫ్రాన్స్), 1814లో హాలండ్ నుంచి విలీనమైన బ్రిటిష్ గయానా లాంటి ద్వీపాలు ఉన్నాయి. భారతదేశం విషయానికొస్తే, 1858 నుంచి బ్రిటిష్ రాచరికపు ప్రత్యక్ష పరిపాలనలోనే ఉంది................................© 2017,www.logili.com All Rights Reserved.