Ardika Vyavasthaku Yudham Sega

By Tummala Kishore (Author)
Rs.100
Rs.100

Ardika Vyavasthaku Yudham Sega
INR
MANIMN7066
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

స్వయం సమృద్ధతే తారక మంత్రం

ప్రస్తుత శతాబ్దంలో ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని 'గ్లోబల్ విలేజ్'గా మారిన నేపథ్యంలో, ఎక్కడ ఏ మూల చిన్న నిప్పుకణిక రాజుకున్నా దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా సామాన్యుడి వంటింటి బడ్జెట్ నుండి దేశ జీడీపీ వృద్ధిరేటు వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి.

యుద్ధాలు ఏ కాలంలోనూ, ఎవరికీ మంచివి కావు.

వ్యక్తి స్థాయి నుంచి మొదలు పెట్టి, దేశాల స్థాయి వరకు శాంతి ఉంటేనే నిజమైన ప్రగతి, అభివృద్ధి సాధ్యమవుతాయని నేను వివిధ వేదికలపై తరచూ చెబుతూనే ఉన్నాను. తాజా యుద్ధాల వల్ల నేడు దేశాలన్నీ ఏ విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయో మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం రెండు లేదా మూడు దేశాల మధ్యే యుద్ధం జరుగుతున్నప్పటికీ, ప్రపంచీకరణ వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తీవ్ర ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా, ఆ యుద్ధంతో నేరుగా ఎలాంటి సంబంధం లేని ఎన్నో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా నేడు ఊహించని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల వల్ల ఆర్థికంగా ఎదురవుతున్న సవాళ్ల గురించి ప్రముఖ రచయిత శ్రీ తుమ్మల కిశోర్ గారు 'ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సెగ' పుస్తకంలో సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించారు.

ప్రపంచ వాణిజ్యానికి ముఖ్య రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిన విషయంతో పాటు, చమురు ధరలు పెరిగితే దేశ కరెంటు ఖాతా లోటు ఏ విధంగా పెరుగుతుందో కిశోర్ గారు సరళంగా వివరించే ప్రయత్నం చేశారు.........................

స్వయం సమృద్ధతే తారక మంత్రం ప్రస్తుత శతాబ్దంలో ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని 'గ్లోబల్ విలేజ్'గా మారిన నేపథ్యంలో, ఎక్కడ ఏ మూల చిన్న నిప్పుకణిక రాజుకున్నా దాని ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా సామాన్యుడి వంటింటి బడ్జెట్ నుండి దేశ జీడీపీ వృద్ధిరేటు వరకు అన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. యుద్ధాలు ఏ కాలంలోనూ, ఎవరికీ మంచివి కావు. వ్యక్తి స్థాయి నుంచి మొదలు పెట్టి, దేశాల స్థాయి వరకు శాంతి ఉంటేనే నిజమైన ప్రగతి, అభివృద్ధి సాధ్యమవుతాయని నేను వివిధ వేదికలపై తరచూ చెబుతూనే ఉన్నాను. తాజా యుద్ధాల వల్ల నేడు దేశాలన్నీ ఏ విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయో మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. కేవలం రెండు లేదా మూడు దేశాల మధ్యే యుద్ధం జరుగుతున్నప్పటికీ, ప్రపంచీకరణ వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో తీవ్ర ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా, ఆ యుద్ధంతో నేరుగా ఎలాంటి సంబంధం లేని ఎన్నో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా నేడు ఊహించని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల వల్ల ఆర్థికంగా ఎదురవుతున్న సవాళ్ల గురించి ప్రముఖ రచయిత శ్రీ తుమ్మల కిశోర్ గారు 'ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సెగ' పుస్తకంలో సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించారు. ప్రపంచ వాణిజ్యానికి ముఖ్య రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిన విషయంతో పాటు, చమురు ధరలు పెరిగితే దేశ కరెంటు ఖాతా లోటు ఏ విధంగా పెరుగుతుందో కిశోర్ గారు సరళంగా వివరించే ప్రయత్నం చేశారు.........................

Features

  • : Ardika Vyavasthaku Yudham Sega
  • : Tummala Kishore
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN7066
  • : paparback
  • : June, 2026
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ardika Vyavasthaku Yudham Sega

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam