భారత దేశంలో వేదకాలానికి ముందే నాటకరంగం ఆవిర్భవించి, క్రమంగా పెంపొంది పరాకాష్టకు చేరుకొన్నదనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. భరతముని నాట్య శాస్త్రం రచించా డని చరిత్రకారులు విశ్వసిస్తున్నా దానిని తనకు బ్రహ్మ ప్రసాదించి. నట్లు భరతముని చెప్పుకొన్నాడు.
భరతముని సిద్ధాంతం : ఋగ్వేదం నుంచి వాచికం, సామవేదం నుంచి సంగీతం, యజుర్వేదం నుంచి అభినయం, అధర్వణ వేదం నుంచి రసం తీసుకొని నాలుగింటినీ మేళవించి పంచమ వేదంగా నాట్య శాస్త్రాన్ని సృష్టించి బ్రహ్మ భరతమునికి ప్రసాదిం చాడు. భరతముని దాన్ని తన పుత్ర (శిష్య) శతానికి సాకల్యంగా ఉపదేశించి ప్రయోగ విధానం నేర్పాడు. అయితే భరతముని పుత్రులకు తోడుగా బ్రహ్మ 24 మంది అప్సరసలను సృష్టించి ఇచ్చాడు. ఈ విధంగా ప్రయోగ విధానం తెలిపే శాస్త్ర గ్రంథం, నటీ నటులు లభించడంతో భరతముని ఆచార్యత్వంలో ప్రప్రథమ నాటక బృందం ఏర్పడింది. ఈ బృందం భరతముని సారథ్యంలో మహేంద్రధ్వజోత్సవ సమయంలో అసుర పరాజయమనే రూపకం ఆరుబయట ప్రదర్శించారు. దీని ఇతి వృత్తం రాక్షస నాశనం. ఇదే ప్రప్రథమ సంస్కృత నాటకం, నాటక ప్రయోగం. ఈ ప్రదర్శన సమయంలో రాక్షసులు అల్లరి చేయగా భరతముని వేడుకోలు మీద బ్రహ్మ విశ్వకర్మ నాట్య వేశ్మం(నాటకశాల)ను నిర్మింపచేశాడు. దానితో రంగస్థలం, పరిమిత ప్రేక్షకాగారం లభించాయి.
తరువాత భరతముని బృందం బ్రహ్మ రచించిన అమృత మధన మనే సమవకారం ప్రదర్శించి మెప్పుపొందింది. ఆ తరువాత శివుని సమక్షంలో అమృత మధనం, త్రిపురదాహం ప్రదర్శించారు. ప్రదర్శనం ఇంకా శోభిల్లడానికి ఆవశ్యకమయిన అంగహారాదులను శివుని ఆజ్ఞ మీద తండువు భరతమునికి నేర్పాడు. అపుడే పార్వతి లలితమయిన లాస్యం బోధించింది.
నహుషుడనే భూలోక రాజు ఇంద్రపదవిని అలంకరించి నపుడు ఈ రూపక ప్రదర్శనలను భూలోకంలో వ్యాపింపచేయ వలసిందిగా భరతమునిని కోరాడు. భరతముని తన పుత్రులను భూలోకానికి పంపాడు. అక్కడ ఈ భరత పుత్రులు మనుష్య స్త్రీలతో కలిసి ప్రదర్శనలిస్తూ వారివల్ల సంతానం పొందారు. ఆ విధంగా నాట్యకళ భూలోకంలో వ్యాప్తిచెందింది. నాట్య శాస్త్రంలో నృత్య, సంగీత విషయాలను వివరంగా చెప్పడాన్ని బట్టి ఆ నాటి రూపకాలు సంగీత నృత్యరూపకాలని భావించవచ్చు...........................
భారతీయ నాటక రంగం సంస్కృత నాటకరంగం భారత దేశంలో వేదకాలానికి ముందే నాటకరంగం ఆవిర్భవించి, క్రమంగా పెంపొంది పరాకాష్టకు చేరుకొన్నదనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. భరతముని నాట్య శాస్త్రం రచించా డని చరిత్రకారులు విశ్వసిస్తున్నా దానిని తనకు బ్రహ్మ ప్రసాదించి. నట్లు భరతముని చెప్పుకొన్నాడు. భరతముని సిద్ధాంతం : ఋగ్వేదం నుంచి వాచికం, సామవేదం నుంచి సంగీతం, యజుర్వేదం నుంచి అభినయం, అధర్వణ వేదం నుంచి రసం తీసుకొని నాలుగింటినీ మేళవించి పంచమ వేదంగా నాట్య శాస్త్రాన్ని సృష్టించి బ్రహ్మ భరతమునికి ప్రసాదిం చాడు. భరతముని దాన్ని తన పుత్ర (శిష్య) శతానికి సాకల్యంగా ఉపదేశించి ప్రయోగ విధానం నేర్పాడు. అయితే భరతముని పుత్రులకు తోడుగా బ్రహ్మ 24 మంది అప్సరసలను సృష్టించి ఇచ్చాడు. ఈ విధంగా ప్రయోగ విధానం తెలిపే శాస్త్ర గ్రంథం, నటీ నటులు లభించడంతో భరతముని ఆచార్యత్వంలో ప్రప్రథమ నాటక బృందం ఏర్పడింది. ఈ బృందం భరతముని సారథ్యంలో మహేంద్రధ్వజోత్సవ సమయంలో అసుర పరాజయమనే రూపకం ఆరుబయట ప్రదర్శించారు. దీని ఇతి వృత్తం రాక్షస నాశనం. ఇదే ప్రప్రథమ సంస్కృత నాటకం, నాటక ప్రయోగం. ఈ ప్రదర్శన సమయంలో రాక్షసులు అల్లరి చేయగా భరతముని వేడుకోలు మీద బ్రహ్మ విశ్వకర్మ నాట్య వేశ్మం(నాటకశాల)ను నిర్మింపచేశాడు. దానితో రంగస్థలం, పరిమిత ప్రేక్షకాగారం లభించాయి. తరువాత భరతముని బృందం బ్రహ్మ రచించిన అమృత మధన మనే సమవకారం ప్రదర్శించి మెప్పుపొందింది. ఆ తరువాత శివుని సమక్షంలో అమృత మధనం, త్రిపురదాహం ప్రదర్శించారు. ప్రదర్శనం ఇంకా శోభిల్లడానికి ఆవశ్యకమయిన అంగహారాదులను శివుని ఆజ్ఞ మీద తండువు భరతమునికి నేర్పాడు. అపుడే పార్వతి లలితమయిన లాస్యం బోధించింది. నహుషుడనే భూలోక రాజు ఇంద్రపదవిని అలంకరించి నపుడు ఈ రూపక ప్రదర్శనలను భూలోకంలో వ్యాపింపచేయ వలసిందిగా భరతమునిని కోరాడు. భరతముని తన పుత్రులను భూలోకానికి పంపాడు. అక్కడ ఈ భరత పుత్రులు మనుష్య స్త్రీలతో కలిసి ప్రదర్శనలిస్తూ వారివల్ల సంతానం పొందారు. ఆ విధంగా నాట్యకళ భూలోకంలో వ్యాప్తిచెందింది. నాట్య శాస్త్రంలో నృత్య, సంగీత విషయాలను వివరంగా చెప్పడాన్ని బట్టి ఆ నాటి రూపకాలు సంగీత నృత్యరూపకాలని భావించవచ్చు...........................© 2017,www.logili.com All Rights Reserved.