తెలుగు ప్రచురణకు ముందుమాట
'నిశ్శబ్ద కుట్ర'పై ఒక గాంధేయ విశ్లేషణ
హిమాన్షు కుమార్
తెలుగు అనువాదం: రమాసుందరి
ప్రజాస్వామ్యం, రాజ్యాధికారం, అణగారిన వర్గాలను ఒక మూలకు విసిరేసిన పరిస్థితి: జోసీ జోసెఫ్ రాసిన 'నిశ్శబ్ద కుట్ర'పై గాంధేయ విశ్లేషణ
భారత ప్రజాస్వామ్యపు సమకాలీన చర్చల్లోకి జోసీ జోసెఫ్ రాసిన 'నిశ్శబ్ద కుట్ర' పుస్తకం గణనీయంగా జోక్యం చేసుకొన్నది. భారత ప్రజాస్వామ్యనికున్న బలప్రయోగ, విచారణ సంస్థల పనివిధానంలో ఈ జోక్యం ప్రముఖంగా కనిపించింది. భారతదేశం నిశ్శబ్ద కుట్రకు బలవుతుందని జోసెఫ్ ముందుకు తెచ్చిన కీలక భావన - ప్రభుత్వసంస్థల్లో పైకి మాత్రం ప్రజాస్వామ్య పాలనారూపాన్ని కొనసాగిస్తూ, లోపల రాజ్యాంగపు వాగ్దానాలను ఉపేక్షిస్తూ మెల్లిమెల్లిగా, ఒక పద్దతి ప్రకారం జరుగుతున్న మార్పులను ఎత్తి చూపుతుంది. ఈ మార్పులు ఒకసారిగా వచ్చినవి కాదు. సంచలనాత్మకం అంతకంటే కాదు. ఇవి క్రమంగా పెరుగుతూ, సాధారణీకరణ చెందుతూ -దైనందిన పరిపాలన, న్యాయ ప్రక్రియల్లో అంతర్భాగంగా మారుతున్నాయి.
ఆదివాసీ సమూహాలతో లోతైన అనుబంధ దృక్కోణం నుంచి ఈ పుస్తకం ఒక స్పష్టమైన గాఢమైన అనుభవాధారిత పరిమాణాన్ని సంతరించుకొన్నది. సైనికీకరణ, వనరుల దోపిడీ ఆర్థిక విధానాలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని తడమటం వలన ఈ ప్రత్యేకత ఈ పుస్తకానికి వచ్చింది..........................
తెలుగు ప్రచురణకు ముందుమాట 'నిశ్శబ్ద కుట్ర'పై ఒక గాంధేయ విశ్లేషణ హిమాన్షు కుమార్ తెలుగు అనువాదం: రమాసుందరి ప్రజాస్వామ్యం, రాజ్యాధికారం, అణగారిన వర్గాలను ఒక మూలకు విసిరేసిన పరిస్థితి: జోసీ జోసెఫ్ రాసిన 'నిశ్శబ్ద కుట్ర'పై గాంధేయ విశ్లేషణ భారత ప్రజాస్వామ్యపు సమకాలీన చర్చల్లోకి జోసీ జోసెఫ్ రాసిన 'నిశ్శబ్ద కుట్ర' పుస్తకం గణనీయంగా జోక్యం చేసుకొన్నది. భారత ప్రజాస్వామ్యనికున్న బలప్రయోగ, విచారణ సంస్థల పనివిధానంలో ఈ జోక్యం ప్రముఖంగా కనిపించింది. భారతదేశం నిశ్శబ్ద కుట్రకు బలవుతుందని జోసెఫ్ ముందుకు తెచ్చిన కీలక భావన - ప్రభుత్వసంస్థల్లో పైకి మాత్రం ప్రజాస్వామ్య పాలనారూపాన్ని కొనసాగిస్తూ, లోపల రాజ్యాంగపు వాగ్దానాలను ఉపేక్షిస్తూ మెల్లిమెల్లిగా, ఒక పద్దతి ప్రకారం జరుగుతున్న మార్పులను ఎత్తి చూపుతుంది. ఈ మార్పులు ఒకసారిగా వచ్చినవి కాదు. సంచలనాత్మకం అంతకంటే కాదు. ఇవి క్రమంగా పెరుగుతూ, సాధారణీకరణ చెందుతూ -దైనందిన పరిపాలన, న్యాయ ప్రక్రియల్లో అంతర్భాగంగా మారుతున్నాయి. ఆదివాసీ సమూహాలతో లోతైన అనుబంధ దృక్కోణం నుంచి ఈ పుస్తకం ఒక స్పష్టమైన గాఢమైన అనుభవాధారిత పరిమాణాన్ని సంతరించుకొన్నది. సైనికీకరణ, వనరుల దోపిడీ ఆర్థిక విధానాలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని తడమటం వలన ఈ ప్రత్యేకత ఈ పుస్తకానికి వచ్చింది..........................© 2017,www.logili.com All Rights Reserved.