కాళింది
ఏటి కద్దరిని ఓ లంక కన్పిస్తూంటుంది.
రాయిట్ గ్రామాన్ని అనుకుని పారుతూ ఉంటుంది. బ్రహ్మాణీనది. బ్రహ్మాణీకి స్థానిక నామం కాళింది. పల్లె ప్రజలందరూ కాళిందిని 'కాశీ' అని వ్యవహరిస్తుంటారు. ఈ కాళీనదే ఇటీవల అద్దరిని మేట వేసింది. ఇప్పుడు లంకగా ఉన్న ప్రాంతమంతా మునుపు నదీగర్భం. కాళీ, ఇప్పుడు రామ్హట్ గ్రామాన్ని ఓవంతు గ్రసించి, ఊరుని ఒరుసుకుని పారుతోంది. ఇప్పుడి ఇరవై అడుగులు పెళ్ళ విరిగి పడిందంటే చాలు - గ్రామం యావత్తూ ఏటి పాలవుతుంది.
ఈ క్రొత్తగా యేర్పడిన లంక గురించే తగవులు బయల్దేరాయి. రాన్హాట్ చాలా పురాతన గ్రామం. ఇక్కడి పూర్వపు జమీందారులైన రాయ్ వంశీయులందరూ
చిందర వందరగా విడిపోయారు. ఇలా విడిపోయిన రాయ్ వంశానికి చెందిన దాయాదులందరూ ఆ లంకమీద తమ హక్కుని నిరూపించుకోటానికి ఓచేత కర్రలూ బరిసెలూ, మరొకచేత దస్తావేజులూ పత్రాలూ పట్టుకుని ముందుకి ఉరుకుతున్నారు. వీరిలో ఇప్పుడు ఇద్దరు వడ్డీవ్యాపారులూ, కొందరు రైతులూ కూడా తలలు దూర్చారు. ఈ తగవులో తలపట్లు పడుతున్నవారి సంఖ్య ఇప్పుడు నూట పదిహేనుదాకా పెరిగింది. మళ్ళీ వారిలో వారు ఒకరి కొకరు అందరూ విరోధులే. ఆ లంక తమ పరగణాలో ఏర్పడింది కనుక - దాని మీద హక్కు తమకే సంక్రమించాలి. అని జమీందారుల వాదం. 'తమకి తాకట్టులో ఉన్న ప్రాంతంలో ఆ లంక ఏర్పడింది కనుక అది కూడా తమ తాకట్టులో ఉన్నట్టే లెఖ్క' అని వడ్డీవ్యాపారుల వాదం. ఇహపోతే రైతులందరూ - అద్దరిన ఉన్న తమ భూములనన్నిటినీ కాళీతన పొట్టని పెట్టుకుంది కనుక - ఆ నష్టానికి పరిహారంగా ఆ లంకమీద హక్కు తమకే చెందేట్లు చెయ్యటం న్యాయమని వాదిస్తున్నారు.
రాయ్ వంశీయుల్లో ప్రస్తుతం ఉన్న భాగస్థులు నూట అయిదుగురు. ఈ తగవుతో సంబంధం ఉన్న తక్కిన జమీందారు వర్గీయులందరి పేర్లు వ్రాయాలంటే మూడు పుటలు నిండుతాయి.... వీరిలో నూట యిద్దరు కలిశారు. తక్కిన మూడు....................
కాళింది ఏటి కద్దరిని ఓ లంక కన్పిస్తూంటుంది. రాయిట్ గ్రామాన్ని అనుకుని పారుతూ ఉంటుంది. బ్రహ్మాణీనది. బ్రహ్మాణీకి స్థానిక నామం కాళింది. పల్లె ప్రజలందరూ కాళిందిని 'కాశీ' అని వ్యవహరిస్తుంటారు. ఈ కాళీనదే ఇటీవల అద్దరిని మేట వేసింది. ఇప్పుడు లంకగా ఉన్న ప్రాంతమంతా మునుపు నదీగర్భం. కాళీ, ఇప్పుడు రామ్హట్ గ్రామాన్ని ఓవంతు గ్రసించి, ఊరుని ఒరుసుకుని పారుతోంది. ఇప్పుడి ఇరవై అడుగులు పెళ్ళ విరిగి పడిందంటే చాలు - గ్రామం యావత్తూ ఏటి పాలవుతుంది. ఈ క్రొత్తగా యేర్పడిన లంక గురించే తగవులు బయల్దేరాయి. రాన్హాట్ చాలా పురాతన గ్రామం. ఇక్కడి పూర్వపు జమీందారులైన రాయ్ వంశీయులందరూ చిందర వందరగా విడిపోయారు. ఇలా విడిపోయిన రాయ్ వంశానికి చెందిన దాయాదులందరూ ఆ లంకమీద తమ హక్కుని నిరూపించుకోటానికి ఓచేత కర్రలూ బరిసెలూ, మరొకచేత దస్తావేజులూ పత్రాలూ పట్టుకుని ముందుకి ఉరుకుతున్నారు. వీరిలో ఇప్పుడు ఇద్దరు వడ్డీవ్యాపారులూ, కొందరు రైతులూ కూడా తలలు దూర్చారు. ఈ తగవులో తలపట్లు పడుతున్నవారి సంఖ్య ఇప్పుడు నూట పదిహేనుదాకా పెరిగింది. మళ్ళీ వారిలో వారు ఒకరి కొకరు అందరూ విరోధులే. ఆ లంక తమ పరగణాలో ఏర్పడింది కనుక - దాని మీద హక్కు తమకే సంక్రమించాలి. అని జమీందారుల వాదం. 'తమకి తాకట్టులో ఉన్న ప్రాంతంలో ఆ లంక ఏర్పడింది కనుక అది కూడా తమ తాకట్టులో ఉన్నట్టే లెఖ్క' అని వడ్డీవ్యాపారుల వాదం. ఇహపోతే రైతులందరూ - అద్దరిన ఉన్న తమ భూములనన్నిటినీ కాళీతన పొట్టని పెట్టుకుంది కనుక - ఆ నష్టానికి పరిహారంగా ఆ లంకమీద హక్కు తమకే చెందేట్లు చెయ్యటం న్యాయమని వాదిస్తున్నారు. రాయ్ వంశీయుల్లో ప్రస్తుతం ఉన్న భాగస్థులు నూట అయిదుగురు. ఈ తగవుతో సంబంధం ఉన్న తక్కిన జమీందారు వర్గీయులందరి పేర్లు వ్రాయాలంటే మూడు పుటలు నిండుతాయి.... వీరిలో నూట యిద్దరు కలిశారు. తక్కిన మూడు....................© 2017,www.logili.com All Rights Reserved.