'ఒక ప్రశాంతత, ఒక ప్రకాశిత ఉదయం, ఒక కార్తీకపున్నమీ... కళింగం స్వప్నిస్తోంది. బహుశా, కళింగమే కాదు దేశం, దేశమే కాదు ప్రపంచం.. యీ స్వప్నాన్ని కంటోంది. ఆ స్వప్నమే నా రచనలు... యెనక..' అని తన లక్ష్యాన్ని ప్రకటించి ఆ స్వప్నాన్ని రుజువుపరచే మార్గంలో పయనిస్తున్న ప్రజా రచయిత అట్టాడ అప్పల్నాయుడు. దృక్పథాన్ని జీర్ణించుకొని సమాజాన్ని వర్గపోరాట కేంద్రంగా దర్శిస్తున్న రచయిత అప్పల్నాయుడు. ప్రజావుద్యమాల ద్వారానే శాస్త్రీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందనే విశ్వాసంతో ఉద్యమాలకు స్ఫూర్తి నందించే రచనలనందిస్తున్న ఉత్తరాంధ్ర ఉత్తమ రచయిత అట్టాడ అప్పల్నాయుడు. దోపిడీ పీడనల గురించి కన్నీళ్లు పెట్టించే కథలు ఎన్నయినా రాయవచ్చు. అలా రాసే రచయితలకు కొదవ లేదు. అప్పల్నాయుడు ఆ కోవలోనివాడు కాదు. ఆయన దోపిడీ పీడనల గురించి రాసే కథల పరమార్థం పీడిత వర్గ చైతన్యాన్ని ప్రజ్వలింప చేయటం, దోపిడీ పీడనల వర్గ సమాజ మూలాలను కదిలించటం వైపు ఆలోచనలను ప్రేరేపించటం. - కాత్యాయనీ విద్మహే
'ఒక ప్రశాంతత, ఒక ప్రకాశిత ఉదయం, ఒక కార్తీకపున్నమీ... కళింగం స్వప్నిస్తోంది. బహుశా, కళింగమే కాదు దేశం, దేశమే కాదు ప్రపంచం.. యీ స్వప్నాన్ని కంటోంది. ఆ స్వప్నమే నా రచనలు... యెనక..' అని తన లక్ష్యాన్ని ప్రకటించి ఆ స్వప్నాన్ని రుజువుపరచే మార్గంలో పయనిస్తున్న ప్రజా రచయిత అట్టాడ అప్పల్నాయుడు. దృక్పథాన్ని జీర్ణించుకొని సమాజాన్ని వర్గపోరాట కేంద్రంగా దర్శిస్తున్న రచయిత అప్పల్నాయుడు. ప్రజావుద్యమాల ద్వారానే శాస్త్రీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందనే విశ్వాసంతో ఉద్యమాలకు స్ఫూర్తి నందించే రచనలనందిస్తున్న ఉత్తరాంధ్ర ఉత్తమ రచయిత అట్టాడ అప్పల్నాయుడు. దోపిడీ పీడనల గురించి కన్నీళ్లు పెట్టించే కథలు ఎన్నయినా రాయవచ్చు. అలా రాసే రచయితలకు కొదవ లేదు. అప్పల్నాయుడు ఆ కోవలోనివాడు కాదు. ఆయన దోపిడీ పీడనల గురించి రాసే కథల పరమార్థం పీడిత వర్గ చైతన్యాన్ని ప్రజ్వలింప చేయటం, దోపిడీ పీడనల వర్గ సమాజ మూలాలను కదిలించటం వైపు ఆలోచనలను ప్రేరేపించటం. - కాత్యాయనీ విద్మహే
Features
: Kathasravanthi Attada Appalanaidu Kathalu
: Valluri Sivaprasad Penugonda Lakshminarayana Dr Katyayani Vidmahe