Amarajeevi Potti Sriramulu

By Dr V R Rasani (Author)
Rs.75
Rs.75

Amarajeevi Potti Sriramulu
INR
AMARAVAT34
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            మహాత్మాగాంధీ ప్రియశిష్యుడు, ప్రముఖ గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు. ఇంజనీరింగ్ చదివి రైల్వే ప్లంబర్ గా బొంబాయిలో ఉద్యోగం చేశాడు. పత్ని, పుత్ర, మాతృవియోగంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాముల్ని, దేశ స్వాతంత్రం కోసం మహాత్మాగాంధీ నడుపుతున్న పోరాటం ఆకర్షించింది. సూరత్ లో గాంధీని కలిసి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. గాంధీజీ సమ్మతితో ఉద్యోగానికి రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమానికి చేరాడు. అక్కడ కఠోర దీక్షను, ఆదర్శవంతమైన జీవితాన్ని ఆరంభించాడు. నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. గాంధీజీతో పాటు సత్యాగ్రహాల్లో పాల్గొని జైలుకు వెళ్ళాడు. శ్రీరాములులో అకుంటితదీక్ష, హరిజనోద్ధారణ, జాతీయతాభావం పెల్లుబికింది.

               సబర్మతీ ఆశ్రమం నుండి నెల్లూరు తిరిగొచ్చి హరిజనోద్ధరణకు నడుం బిగించాడు. మద్యపాన నిషేధంకోసం, పరిశుభ్రతకోసం ప్రచారం చేశాడు. నిరశన దీక్ష చేసి హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. అస్పృశ్యతా నివారణకు పాటు పడుతూ అగ్రవర్ణాల వారి చేతిలో దెబ్బలు తిన్నాడు. వితంతు వివాహాలు జరిపించాడు. ఖాదీ ప్రచారకుడిగా ఇంటింటికి తిరిగాడు. హిందూ సంఘ సంస్కరణ సమితిని స్థాపించి సాంఘికసేవా కార్యక్రమాలను చేపట్టాడు. మహాత్మా గాంధీ ఆప్యాయతను, ఆశీస్సులను పొందిన అరుదైన వ్యక్తి శ్రీరాములు. 

                దేశ స్వాతంత్రానంతరము ఆంధ్రుల గుర్తింపు కోసం, ప్రత్యేకరాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆత్మ బలిదాన చేసుకున్న త్యాగమూర్తి శ్రీరాములు. ప్రతి తెలుగువాడూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు పొట్టిశ్రీరాములు. ఆయన జీవిత విశేషాలను ఈ తరం బాలబాలికలు తెలుసుకునేందుకు ప్రచురించిన అమూల్యమైన పుస్తకం.

            మహాత్మాగాంధీ ప్రియశిష్యుడు, ప్రముఖ గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు. ఇంజనీరింగ్ చదివి రైల్వే ప్లంబర్ గా బొంబాయిలో ఉద్యోగం చేశాడు. పత్ని, పుత్ర, మాతృవియోగంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాముల్ని, దేశ స్వాతంత్రం కోసం మహాత్మాగాంధీ నడుపుతున్న పోరాటం ఆకర్షించింది. సూరత్ లో గాంధీని కలిసి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. గాంధీజీ సమ్మతితో ఉద్యోగానికి రాజీనామా చేసి సబర్మతీ ఆశ్రమానికి చేరాడు. అక్కడ కఠోర దీక్షను, ఆదర్శవంతమైన జీవితాన్ని ఆరంభించాడు. నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. గాంధీజీతో పాటు సత్యాగ్రహాల్లో పాల్గొని జైలుకు వెళ్ళాడు. శ్రీరాములులో అకుంటితదీక్ష, హరిజనోద్ధారణ, జాతీయతాభావం పెల్లుబికింది.                సబర్మతీ ఆశ్రమం నుండి నెల్లూరు తిరిగొచ్చి హరిజనోద్ధరణకు నడుం బిగించాడు. మద్యపాన నిషేధంకోసం, పరిశుభ్రతకోసం ప్రచారం చేశాడు. నిరశన దీక్ష చేసి హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. అస్పృశ్యతా నివారణకు పాటు పడుతూ అగ్రవర్ణాల వారి చేతిలో దెబ్బలు తిన్నాడు. వితంతు వివాహాలు జరిపించాడు. ఖాదీ ప్రచారకుడిగా ఇంటింటికి తిరిగాడు. హిందూ సంఘ సంస్కరణ సమితిని స్థాపించి సాంఘికసేవా కార్యక్రమాలను చేపట్టాడు. మహాత్మా గాంధీ ఆప్యాయతను, ఆశీస్సులను పొందిన అరుదైన వ్యక్తి శ్రీరాములు.                  దేశ స్వాతంత్రానంతరము ఆంధ్రుల గుర్తింపు కోసం, ప్రత్యేకరాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆత్మ బలిదాన చేసుకున్న త్యాగమూర్తి శ్రీరాములు. ప్రతి తెలుగువాడూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు పొట్టిశ్రీరాములు. ఆయన జీవిత విశేషాలను ఈ తరం బాలబాలికలు తెలుసుకునేందుకు ప్రచురించిన అమూల్యమైన పుస్తకం.

Features

  • : Amarajeevi Potti Sriramulu
  • : Dr V R Rasani
  • : Amaravathi Publications
  • : AMARAVAT34
  • : Paperback
  • : 2017
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amarajeevi Potti Sriramulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam