మానవత్వానికి - మంచితనానికి మరో పేరు మదర్ ధేరిస్సా. అభాగ్యులకూ, అనాధలకూ అమ్మవొడి ధేరిసా. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పదష్టులారా, రారండంటూ ఆప్యాయతా అనురాగంతో అక్కున చేర్చుకొనే అమృత మూర్తి మదర్ ధేరిసా. నిరంతరం కృషికి, నిరాడంబరతకూ చిరునామా అమ్మ ధేరిసా.
ఇంతటి మహనీయ త్యాగశీలి జీవిత చరిత్రను రాయటం మాటలు కాదు. దాన్ని సాధ్యం చేసిన వ్యక్తీ శ్రీ నవీన్ చావ్లా. వీరు సుమారు 23 సంవత్సరాలు మదర్ ధేరిసా సన్నిహిత మిత్రులతో ఒకరుగా ఉండటమే కాక, ఆమె నిర్వహించిన అనేకానేక సేవా కార్యక్రమాలకు అధికారికంగా చేయూత నిచ్చిన భారత ప్రభుత్వ ఐ.ఏ.యస్. అధికారి. ఆంగ్లంలో రాసిన ఈ జీవిత చరిత్రను మదర్ స్వంతంగా చదివి శుభాకాంక్షలందించిందంటేనే ఈ రచన సాధికారికత నిరూపితమవుతుంది. ఇప్పటికి ఇది ప్రపంచంలోని 14 భాషల్లోకీ అనువాదం పొందింది. శ్రీ నవీన్ చావ్లా లారెన్స్ స్కూల్ సనవార్ లోనూ, సెయింట్ స్టిఫెన్స్ కాలేజి డిల్లీలోనూ ఆ తర్వాత లండన్ లోనూ విద్యాభ్యాసం చేశారు. లండన్ లోని స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో విద్యాభ్యాసం కొనసాగించడమేకాక, ఆ తర్వాత ఆక్స్ ఫర్డ్ లోని క్విన్ ఎలిజబెత్ హౌస్ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.
శ్రీ నవీన్ చావ్లా భారత ప్రభుత్వ ప్రసార శాఖలోనూ, హోమ్ శాఖలోనూ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. కొంత కాలం డిల్లీ విద్యుత్ బోర్డు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ప్రస్తుతం పాండిచ్చేరి పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ కూ, పాండిచ్చేరి టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ కూ చైర్మన్ గా పాండిచ్చేరిలో ఉంటున్నారు.
మదర్ ధేరిసా స్థాపించిన 'మిషనరిస్ ఆఫ్ ఛారిటీ' విశ్వవ్యాప్త కార్యక్రమాలు స్థూల రూపం ఇది. ఓ సాధారణ ఆల్బేనియా కన్య ప్రపంచ మానవుడి గుండెలలో మదర్ గా గౌరవం పొందిన విశ్వరూప క్రమం ఇది.ఆపన్నుల బాధాతప్త హృదయాలను సమాశ్వాసించే అమృత హస్తాల చల్లదనం అనుభవానికి తెచ్చే ప్రత్యక్షర సత్యం ఈ గ్రంథం.
మానవత్వానికి - మంచితనానికి మరో పేరు మదర్ ధేరిస్సా. అభాగ్యులకూ, అనాధలకూ అమ్మవొడి ధేరిసా. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పదష్టులారా, రారండంటూ ఆప్యాయతా అనురాగంతో అక్కున చేర్చుకొనే అమృత మూర్తి మదర్ ధేరిసా. నిరంతరం కృషికి, నిరాడంబరతకూ చిరునామా అమ్మ ధేరిసా. ఇంతటి మహనీయ త్యాగశీలి జీవిత చరిత్రను రాయటం మాటలు కాదు. దాన్ని సాధ్యం చేసిన వ్యక్తీ శ్రీ నవీన్ చావ్లా. వీరు సుమారు 23 సంవత్సరాలు మదర్ ధేరిసా సన్నిహిత మిత్రులతో ఒకరుగా ఉండటమే కాక, ఆమె నిర్వహించిన అనేకానేక సేవా కార్యక్రమాలకు అధికారికంగా చేయూత నిచ్చిన భారత ప్రభుత్వ ఐ.ఏ.యస్. అధికారి. ఆంగ్లంలో రాసిన ఈ జీవిత చరిత్రను మదర్ స్వంతంగా చదివి శుభాకాంక్షలందించిందంటేనే ఈ రచన సాధికారికత నిరూపితమవుతుంది. ఇప్పటికి ఇది ప్రపంచంలోని 14 భాషల్లోకీ అనువాదం పొందింది. శ్రీ నవీన్ చావ్లా లారెన్స్ స్కూల్ సనవార్ లోనూ, సెయింట్ స్టిఫెన్స్ కాలేజి డిల్లీలోనూ ఆ తర్వాత లండన్ లోనూ విద్యాభ్యాసం చేశారు. లండన్ లోని స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో విద్యాభ్యాసం కొనసాగించడమేకాక, ఆ తర్వాత ఆక్స్ ఫర్డ్ లోని క్విన్ ఎలిజబెత్ హౌస్ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. శ్రీ నవీన్ చావ్లా భారత ప్రభుత్వ ప్రసార శాఖలోనూ, హోమ్ శాఖలోనూ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. కొంత కాలం డిల్లీ విద్యుత్ బోర్డు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ప్రస్తుతం పాండిచ్చేరి పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ కూ, పాండిచ్చేరి టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్ కూ చైర్మన్ గా పాండిచ్చేరిలో ఉంటున్నారు. మదర్ ధేరిసా స్థాపించిన 'మిషనరిస్ ఆఫ్ ఛారిటీ' విశ్వవ్యాప్త కార్యక్రమాలు స్థూల రూపం ఇది. ఓ సాధారణ ఆల్బేనియా కన్య ప్రపంచ మానవుడి గుండెలలో మదర్ గా గౌరవం పొందిన విశ్వరూప క్రమం ఇది.ఆపన్నుల బాధాతప్త హృదయాలను సమాశ్వాసించే అమృత హస్తాల చల్లదనం అనుభవానికి తెచ్చే ప్రత్యక్షర సత్యం ఈ గ్రంథం.
© 2017,www.logili.com All Rights Reserved.